ఎండతో ఎఫెక్టయ్యేది ముఖ చర్మం. కళ్ళజోడు వాడినా క్యాప్ పెట్టుకున్నా ఎండ తాకిడికి మొహం కందిపోయి పొడిబారి పోతుంది. కమిలిన చర్మానికి అలోవేరా గుజ్జు అద్భుతమైన ఉపశమనం. అలాగే బొప్పాయి గుజ్జు కుడా. ఈ రెండు రకాల గుజ్జులు చర్మాన్ని యధాస్థితికి తెస్తాయి. ఎండలో నుంచి బయటకు రాగానే దోస రసం, పుచ్చకాయ రసం కలిపి ఆ నీటిలో దూది తడిపి మొహనికి , మెడకు రాసి కాసేపు ఆగి కడిగేయాలి. పాలలో దూది ముంచి మొహం తుడిచిన మలినాలు పోయి చర్మం మృదువుగా అవుతుంది. మాయిశ్చరయిజర్ కూడా మంచిదే ఎస్ పీ ఎఫ్ 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్‌ రాసుకుంటే ఎండకు చర్మం కమిలిపోకుండా ఉంటుంది.

Leave a comment