ఆమె చిన్నతనం నుంచి అందాల రాణి అవ్వాలనే కోరుకుంది. ఒక కారు ప్రమాదంలో మొహం పూర్తిగా దెబ్బతిని పోయింది. అయినా సంకల్పబలం తో ఏడాదిలోపే కోలుకుని తిరిగి తన పూర్వ సౌందర్యం తెచ్చుకొని 2021 మిస్ వరల్డ్ పోటీల్లో నిలబడి. మొదటి రన్నర్-అప్ గా నిలిచింది. ఆమె పంజాబ్ కు చెందిన శ్రీ సైనా అమెరికా లో స్థిరపడ్డ భారత కుటుంబం ఆమెది. 2017 లో మిస్ ఇండియా యు.ఎస్.ఏ కిరీటాన్ని మరుసటి సంవత్సరం మిస్ వరల్డ్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటం దక్కించుకుంది. అందాల రాణి గానే గాక మెంటల్ ఎమోషనల్ హెల్త్ యాక్టివిస్ట్ గా మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తూ ఎంతోమంది పేరణ గా నిలుస్తోంది శ్రీ సైనా.

Leave a comment