రమణి పీతాంబరన్ తన 68 వ ఏట మోడలింగ్ లో అడుగు పెట్టారు. పెంపుడు కొడుకు రాజీవ్ ఫ్యాషన్ డిజైనర్. అతను డిజైన్ చేసిన చీరలకు తల్లిని మోడల్ గా చేసుకున్నాడు. ఆమెను దృష్టిలో పెట్టుకొని ఈ రాజీవ్ డిజైన్ చేసిన చీరలు పాపులర్ అయ్యాయి.ముఖ్యంగా రమణి  పీతాంబరన్ మోడల్ గా ఇంకా ఎక్కువ పాపులారిటీ పొందారు. ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ. భూతకాలమ్, ట్రాన్స్ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. దేనికైనా వయసు ప్రధానం కాదని నిరూపించారు రమణి.

Leave a comment