షిర్డీలోని సాయి తీర్థం ధీమ్ పార్క్ చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది . షిర్డీలో సాయిబాబా గుడితో పటు దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలని చూడవచ్చు . సాయిబాబా మందిరానికి కిలో మీటర్ దూరంలోని నీమ్ గావ్ లో ఈ ఆధ్యాత్మిక ధీమ్ పార్క్ ఏర్పాటు చేశారు . తిరుపతి ,మధుర మీనాక్షి ,పూరి జగన్నాద్ ,అమృతసర్ ,పండరీపూర్ ముంబయ్ లోని సిద్ది వినాయక వంటి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి . ప్రతి గుడి దగ్గర అది ఏ ప్రాంతంలో ఎవరు నిర్మించారు వివరాలు ఉంటాయి . నలభై వేళా చదరపు  అడుగుల్లో మాల్ పాన్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఈ పార్కులో రామాయణం లోని లంకా దహన ఘట్టం ,సాయిబాబా జీవితచరిత్ర త్రీడి షో కూడా ఉంటుంది .

Leave a comment