ఐఏఎస్ అధికారిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన సామాజిక అభివృద్ధి వంటి వాటితో పాటు పర్యావరణ పరిరక్షణ మహిళా సాధికారత వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించిన దాసరి హరిచందన కు యుకె ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్ అవార్డ్ 2021 ను ప్రకటించింది. తెలంగాణ లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న హరి చందాన పర్యావరణ ప్రేమికురాలు మహిళ సాధకరత కోసం వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా కోస్వి లో షీ మొబైల్ టాయిలెట్ ప్రారంభించి దాని బాధ్యత స్థానిక మహిళా సంఘాలకు అప్పగించారు. అరణ్య పేరుతో మహిళా సంఘాల నేతృత్వంలో నాలుగు లక్షలకు పైగా కాటన్ మాస్క్ లు తయారు చేయించారు.

Leave a comment