ఢిల్లీ కి చెందిన ప్రసిద్ధ ఆర్ట్ కలక్టర్ శాలిని పస్సి (Shalini passi ) యువ కళాకారులను ప్రోత్సహించటం లో ముందుంటారు సంపన్న వర్గాలకే అందుబాటులో ఉన్న ఆర్ట్ వరల్డ్ ను ఇప్పుడు మారుమూల గ్రామాల్లోకి తీసికుపోయింది శాలిని. భోజ్ సలహా సంఘం సభ్యురాలిగా,సొంత ఫౌండేషన్ స్వఫ్ తరఫున యువ చిత్రకారులను ప్రోత్సహించటం తో పాటు కెరీర్ లో నిలదొక్కుకునేలా చేస్తుంది. మెటల్ అండ్ క్లాత్ వర్క్ లో ఆయేషా సింగ్,జియో మెట్రిక్ ఆర్ట్ లో తేజా గోవాంకర్ టెర్ట్స్ అండ్ పేపర్ మేకింగ్ సౌభియా సుష్మ వంటి ఆర్టిస్ట్ లను వెలుగులోకి తీసుకు వచ్చింది శాలిని. ఈ ప్రపంచం లో అందరు చిత్ర కారులే అంటుంది శాలిని.

Leave a comment