ఆన్ లైన్ క్లాసు లో పాల్గొనేందుకు టాప్ టాప్, స్మార్ట్ ఫోన్ లు లేక, నిస్సహాయంగా చదువుకు దూరంగా ఉన్న పేద పిల్లల కోసం ఐటీ సంస్థలతో సంప్రదించి వారి సాయం తీసుకొచ్చింది గుణిషా అగర్వాల్.చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ కుమార్తె. థింక్‌ఫినిటీ అండ్‌ కన్సల్టింగ్‌ కంపెనీ గుణిషా కు సాయంగా వచ్చాయి. ఈ సంస్థ ఉచితంగా వెబ్ సైట్ కూడా చేసి ఇచ్చింది. చెన్నై చుట్టుపక్కల చాలామందే లాప్ టాప్ లు గుణిషా కు విరాళంగా ఇస్తున్నారు. ఎంతోమంది పేద పిల్లలకు సాయం చేయగలుగుతోంది గుణిషా.

Leave a comment