పట్టు చీరెలు పేరు చెబితే కంచి తో పాటు గుర్తుకోచ్చేది అనంతపురం జిల్లా ధర్మవరం .అసలు పట్టు చీరెకు భౌగోళిక నేపథ్యం రావటం వెనుక ధర్మవం నేతకారుల కృషి ,డిజైన్ల గొప్ప తనమే కారణం .గాఢమైన రంగులతో పెద్ద పైట కొంగు అంచులు ఉండటం ఈ చీరెలకు గొప్ప అందం తెచ్చిపెడుతుంది. ధర్మవరం ముత్యాల పట్టు చీరెలతో సరికొత్త డిజైన్ ను సృష్టించారు. ధర్మవరం నేతన్నలు ఒక్కో చీరెలో 800 ముత్యాలకుపైగా పొదిగి నేసిన ఈ చీరె ఖరీదు 30 వేలపై మాటే. చక్కని రంగులు ,అందమైన కొంగులతో ధర్మవరం పట్టు చీరెలు శుభకార్యాలకు మరింత అందం తెస్తాయి.

Leave a comment