ఇంటికి అవసరమైన ఉత్పత్తులను అందిస్తోంది జ్యోతి ల్యాబ్స్. 50 ఏళ్ల క్రితం నీలిమందు ఉజాలా ను కనిపెట్టి దానికోసం ప్రారంభించిన ఫ్యాక్టరీ కి జ్యోతి ల్యాబ్స్ అని కూతురి పేరు పెట్టారు రామచంద్రన్.2020 ఏప్రిల్ లో ఆ సంస్థ ఎం. డి అయింది జ్యోతి. బట్టలు ఉతికే డిటర్జెంట్ లు డిష్ వాషింగ్ కు ఉపయోగపడే సబ్బులు లిక్విడ్స్ ను తయారు చేస్తుంది సంస్థ. జ్యోతి బాధ్యత తీసుకున్న సమయంలో ఆ కంపెనీ రెవెన్యూ 1700 కోట్లు అది ఇప్పుడు 2500 కోట్లు. దేశం లోని 23 ప్రదేశాల్లో వీరి ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి ఇప్పటికి ఉజాలా  నీలిమందు పోటీ లేకుండా నడుస్తుంది.

Leave a comment