కేంద్ర ప్రభుత్వరంగ  సంస్థల  ఎంపిక మండలి (PESB) చైర్మన్ గా నియమితులయ్యారు మల్లికా శ్రీనివాసన్. ఆటోమొబైల్ రంగంలో ట్రాక్టర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు మల్లిక. ఏడాదికి లక్షన్నర ట్రాక్టర్లు అమ్మకాలతో అమెరికా యూరప్ దేశాల్లో కూడా తన సంస్థ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. వందకు పైగా దేశాల్లో విస్తరించిన 9300 కోట్ల విలువైన సంస్థ టాఫే రథసారథి మల్లికా శ్రీనివాసన్. హైడ్రాలిక్ పంపులు డీజిల్ ఇంజన్లు మొదలైన ఉత్పత్తుల తయారీలో కూడా ఉన్నారామె శంకర్ నేత్రాలయ వంటి సంస్థలకు ఎంతో అండగా ఉన్నారు మల్లికా శ్రీనివాసన్.

Leave a comment