పెళ్ళయ్యాక ,విదేశాలకు వెళ్ళాక ఎలాగోలా భార్యను వదిలించుకొని చక్కగా దేశాలు దాటి పోతున్న వారిని నియంత్రించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మధ్యకాలంలో 25 మంది ఎన్నరై భర్తలపై వారి పాస్ పోర్ట్ రద్దుచేసి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రశిశు అభివృద్ధి చేశాక తాజాగా విడుదల చేసిన సమాచారంలో వెల్లడైంది. భార్యకు ,కుటుంబ సభ్యులకు నాన్ బెయిలబుల్ వారెంట్లకు దొరక్కుండా తిరిగే ఇలాంటి భర్తలను వలపన్ని పట్టుకునేందుకు జారీ అయినా ఈ నోటీస్ వల్ల నిందితులు దేశాలు దాటేందుకు వీలుండదు.ఈ చట్టాన్ని కట్టుదిట్టం చేసినందువల్ల ఇంతవరకు ,ఈ సంవత్సరం 578 మంది మహిళలు తమ భర్తలపై కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

Leave a comment