చలి కాలంలో వాతావరణం హాయిగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువే. ఈ సమయంలో వచ్చే సూక్ష్మజీవుల ప్రభావం నుంచి బయటపడేందుకు రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. అందుకోసం వెల్లుల్లి ,ఉల్లిని ఆహరంలో పెంచాలి.గొంతు సమస్యలు ఎక్కువే. పరిష్కారం తేనే,అల్లం వాడకం పెంచాలి. అల్లం ,తులసి టీ తాగితే జలుబు గొంతునొప్పి ,జ్వరాల నుంచి బయటపడటం తేలిక. బీట్ రూట్ పచ్చకూరలు ,తాజా ఆకు కూరలు, పండ్లు తినాలి. అలాగే వ్యాయామం తప్పనిసరి .ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నిద్ర తగినంత ఉండాలి. శరీరాన్ని ప్రతి రోజు ఆలివ్ నూనె లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకొని మంచి సున్నిపిండితో స్నానం చేస్తే మంచిది.

Leave a comment