స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ  నుంచి ఒక చిన్న శాటిలైట్  లో భగవద్గీతను ప్రధాని మోదీ చిత్రాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ బృందానికి నేతృత్వం  వహిస్తోంది. స్పేస్ కిడ్జ్ ఇండియా సి ఇ ఓ మన తెలుగు మహిళ డాక్టర్ శ్రీమతి కేశవ్ మా సంస్థ శాటిలైట్ డిజైన్ లు చేసి ఆవిష్కరిస్తోంది.ఇప్పటి వరకు 12 బెలూన్ సాట్ లు 2 సబ్ ఆర్బిటర్ సాటి లైట్స్ పంపించాం. ఇందులో నాసా నుంచి వెళ్ళిన కలాం శాట్ కూడా ఉంది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్ళిన అతి తక్కువ బరువు ఉన్న శాట్ ఇదే అంటున్నారు శ్రీమతి కేశవ్. మా వంటి చిన్న సంస్థ ఇస్రో తో కలిసి పని చేసేందుకు ప్రధాని మోదీ అవకాశం కల్పించారు. అందుకే కృతజ్ఞతగా ఆయన ఫోటోను అంతరిక్షంలోకి పంపించదలుచుకోన్నాం ప్రధానికి అందని అపూర్వమైన గౌరవం మేము ఇవ్వాలనుకుంటున్నాం  అన్నారు శ్రీమతి కేశవ్.

Leave a comment