దుబాయ్ లో పనిచేస్తున్న బారతీయ వైద్యురాలు అయేషా సుల్తానా చేసిన ట్వీట్ వైరల్ అయింది. అక్కడి కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న డాక్టర్ల లో అయేషా ఒకరు. తాను పనిచేస్తున్న ఆల్ అహ్లీ  స్క్రీనింగ్ సెంటర్ నుంచి కారులో ఇంటికి వెలుతుండగా ఆమెను ఆపిన పోలీస్ అధికారి ఆమె ఐడి కార్డు చూపించే లోపే గుర్తుపట్టి సెల్యూట్ చేసి దారి చూపించాడు. ఈ గౌరవ వందనంతో తనకు కళ్ళనీళ్ళు వచ్చాయని,గంటల తరబడి ఆస్పత్రిలో పడిన అలసటను ఈ గౌరవం ఒక్క నిముషం లో పోగొట్టి తనను సంతోష పెట్టిందని ఆమె ట్విటర్ లో రాసుకొచ్చారు. ఇది ఆమెకే కాదు వైద్య రంగానికే సెల్యూట్ అంటున్నారు నెటిజనులు.

Leave a comment