కాలుష్యం జీవనశైలి మార్పులతో శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోతాయి. వాటిని వదిలించుకోవాలంటే కొన్ని పానీయాలు తాగాలి ఒక గ్లాస్ నీళ్ళలో ఓ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ చిటికెడు దాల్చిన చెక్క పొడి స్పూన్ తేనె కలుపుకొని ఆ నీటిని భోజనం ముందు తాగాలి. పచ్చి అవిసె గింజల పొడి గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ కలిపి తాగాలి. ఒక లీటర్ నీళ్లలో రెండు నిమ్మ చెక్క లు మూడు కీరదోస ముక్కలు చిన్న అల్లం ముక్క రెండు యాపిల్ ముక్కలు వేసి ఒక ఐదారు గంటలు అలా ఉంచి ఆ నీళ్లను తాగితే శరీరంలో మలినాలు పోతాయి.

Leave a comment