Categories
![ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. అలాగే ఓట్స్ కూడా మంచి సౌందర్య పోషకమే. ఓట్స్ ఓ గుప్పెడు వేడి నీళ్ళల్లో నానబెట్టి గంధం పెరుగు వేసి కలిపి ఫేస్ పాక్ వేసినా చెక్కని కళే. పాలు కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తాయి. పాలు గంధం, బొప్పాయి గుజ్జు, తేనె కలిపి ఫేస్ పాక్ వేస్తె ఎంత అందం మొహం పైకి వస్తుందో న్యాయంగా చూసి తలుసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వచ్చేదే అసలైన అందం.](https://vanithavani.com/wp-content/uploads/2016/12/natural-face-pack.jpg)
మొహం అలసట వాడిపోయి నిర్జీవంగా యిపోతే క్యారెట్ మాస్క్ ట్రయ్ చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జిడ్డు చర్మం తత్వం ఉన్న సాధరణ చర్మతత్వం ఉన్నా ఈ మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. రెండు క్యారెట్లు నీళ్ళలో ఉడకనిచ్చి చల్లార్చి మెత్తని గుజ్జుగా గ్రైండ్ చేసి ఆ గుజ్జుకు నాలుగు స్పూన్లు తేనె ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ,కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి దీన్ని మాస్క్ లా వేసుకుని ఓ అరగట అలా వదిలేయాలి.ఆ తర్వాత చన్నిళ్ళతో కడుక్కోవాలి.వారానికి మూడు సార్లు ఈ ప్యాక వేసుకోవాలి. క్యారెట్ లో గ్లూకోజ్,ఐరన్,కాఫర్,విటమిన్ ఇ,డి,కే లతో పాటు బీటాకెరోటిన్ ఉంటుంది. ఈ ప్యాక్ తో చర్మం సహజంగా మెరుస్తూ ఉంటుంది.