నేపాల్ లో వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్ అయినా పూర్ణిమ శ్రేష్ఠ.13 రోజుల్లో మూడు సార్లు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ప్రపంచంలోనే మొదటి మహిళగా రికార్డ్ సాధించింది. 33 ఏళ్ల పూర్ణిమ 2018 లో పర్వతారోహణ మొదలు పెట్టింది. 2022 లో కాంచన గంగ మకాలు ను అధిరోహించింది.ఇకపై తాను మౌంటె నియర్ గా గైడ్ గా పనిచేయాలనుకొంటోంది పూర్ణిమ.వృత్తి రీత్యా ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే   అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ పరిచయం అయ్యి తానే ఎవరెస్ట్ నిర్ణయించుకున్నది పూర్ణిమ. సాటి మహిళలను పర్వతారోహణ కోసం ప్రోత్సహించేందుకు జీవితకాలం కృషి చేస్తానని రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ ఎక్కిస్తాను అంటుంది పూర్ణిమ.

Leave a comment