రెండు పూటల కోసం ఒకే సారి వండేసి ఫ్రిజ్లో పెట్టేస్తారు సాధారణంగా ఉద్యోగినులైన వాళ్ళు .వచ్చి రాగానే ఉరుకులు పరుగులతో ఇబ్బంది లేకుండా కాస్త వేడి చేసుకొని తీరుబడిగా సాయంత్రం భోజనం చేసేస్తారు. అయితే కొన్ని పదార్థాలు వేడి చేయకండి అంటారు డాక్టర్లు. పాలకూరతో బంగాళాదుంపలను వేడి చేసినప్పుడు మృత బాక్టీరియా విడుదల అవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు ఒక సారి వండేక మళ్ళీ వేడి చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. చికెన్ వంటలు కూడా పదే పదే వేడి చేయరాదు. ఉడికించిన కోడి గుడ్డు గంటలు గంటలు ఉంచకుండా వెంటనే తినాలి. ఫ్రిజ్ లో ఉంచిన పదార్థాలు సాయంత్రం వేళ బయటికి తీసిపెట్టేస్తే తినేవేళకు అవి రూమ్ టెంపరేచర్ కు వచ్చేస్తాయి.అప్పుడు సమస్య ఉండదు.

Leave a comment