యూనివర్సిటీ ఆఫ్ గోథెన్ బర్గ్ పరిశోధకులు ఒక అవసరమైన పరిశోధన పూర్తి చేశారు. వ్యయామానికి, మతిమరుపు కు దగ్గర సంబంధం ఉందంటున్నారు. 40,45 మధ్య వయసులో స్త్రీ లు సైక్లింగ్ , వాకింగ్ వంటి వ్యయామాలు క్రమం తప్పకుండా చేస్తే భవిష్యత్తులో ఈ డెమెన్షియా భారీన పడకుండా ఉంటారని ఈ ముప్పునుంచి 90 శాతం వరకు తప్పించుకొగలరని చెపుతున్నారు. వెయ్యి మంది మధ్య వయస్కులైన స్త్రీలపై ఈ అధ్యయనం జరిగింది. శరీరం చురుగ్గా ఉంచుకొగలిగే కొన్ని సమస్యలు దగ్గరకు కూడా రావని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వ్యయామం చేస్తూ శరీరాన్ని,మెదడును చురుగ్గా ఉంచుకొన్న మహిళల్లో మతి మరుపు లక్షణాలు లేవన్నారు.

Leave a comment