నౌకాదళం లో వైద్య విభాగపు చీఫ్ షీలా సమంత మథాయ్ 1985 లో నేవీ లో డాక్టర్ గా చేరిన షీలా సామంత 26 సంవత్సరాల సర్వీస్ లో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఐ.ఎన్.హెచ్.ఎస్ అశ్విని నౌకకు ఆమె కమాండర్ ఆఫీసర్ నేవీ ముంబయ్ లోని ఇండియన్ నేవీ హాస్పిటల్ ల్లో కోవిడ్ సమయంలో షీలా సమంత ఇంచార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్రన్ నావెల్ కమాండ్ కి మెడికల్ ఆఫీసర్ షీలా. దేశం గర్వింపదగిన  తగిన వైద్యురాలైనా ఆమె నేవీ లో చేరాక గోవా, అండమాన్ ద్వీపాలలో నేవీ ఆస్పత్రుల స్థాపన చేశారు. విశాఖపట్నం ఈస్ట్రన్ నేవీ లో కమాండ్ మెడికల్ ఆఫీసర్ గా సేవలు అందించారు. ఎన్నో విద్యాలయాలకు మెడికల్ ఎగ్జామినర్ మెడికల్ సొసైటీ ఎడిటర్ గా సేవలు అందిస్తున్న షీలా సామంత కు నేవింగ్, ట్రెక్కింగ్ అన్న ఇష్టం ఆమె భర్త కూడా నేవీ లో వైద్యుడే.

Leave a comment