పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చేసి చెప్పేసి ఆశ్చర్య పరుస్తాయి. చాలా కాలంగా బ్రేక్ ఫాస్ట్ చేయక పొతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడో పరిశోధనా సారాంశం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా వుంటే రోజు మొత్తం మీద తీసుకునే ఆహారంలో 330 క్యాలరీలు తగ్గించుకోవచ్చని లెక్కలేసి చెప్పుతుంది. ఇలా తీసుకోక పోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదనీ చెప్పుతుంది రిపోర్టు. బరువులో కుడా కొంత మార్పు కనిపిస్తుందని పరిశోధకులు సెలవిస్తున్నారు. అయితే కొత్త రీసెర్చ్ ని నమ్మి ఉదయం ఉపాహారం మానక్కరలేదు కానీ, ఓ పూత కష్ట లేటైనా పెద్ద బెంగ పెట్టుకోనక్కరలేదని తేలింది.

Leave a comment