స్పైస్‌జెట్‌ అధినేత అజయ్‌ సింగ్‌ కుమార్తె అవనీసింగ్‌. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ పాలసీలో ఎమ్‌ఎస్‌ పూర్తిచేసి గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ‘మెకిన్సీ’లో అనలిస్ట్‌గా చేరింది.  కరోనా కాలంలో కేసులు పెరగటం చూసి కోవిడ్-19 టెస్టింగ్‌ రంగంలోకి దిగింది అవని.  తండ్రి అజయ్‌సింగ్‌తో కలిసి 2020 నవంబర్‌లో ‘స్పైస్‌హెల్త్‌’ అనే ఇండిపెండెంట్‌ కంపెనీని స్టార్ట్ చేసింది. ల్యాబొరేటరీల ద్వారా ఆర్టీ–పీసీఆర్‌ టెస్ట్‌ను కేవలం 499 రూపాయలకే  అందించి సంచలనం సృష్టించింది. తర్వాతం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ టెస్టులవైపు మొగ్గుచూపింది.దేశవ్యాప్తంగా పది ప్రముఖ నగరాల్లో 18 టెస్టింగ్‌ ల్యాబ్స్, కలెక్షన్‌ సెంటర్లను నడుపుతోందిఅవానీసింగ్.  ఆమెను 2021 వ సంవత్సరానికి  ‘గోల్డ్‌ అవార్డు’ వరించింది.

Leave a comment