ఒంటికాలితో 3800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది తాన్యా దాగా పారా సైక్లిస్ట్ తాన్యా దాగా ది  మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాలోని బ్యావర  పట్టణం. 2018లో ఎంబీఏ చదివేందుకు డెహ్రాడూన్ వెళ్ళిన తాన్యా  కారు ప్రమాదంలో కాలు పోగొట్టుకొంది స్పోర్ట్స్ లో దేన్నైనా ఎంచుకొని కొత్త జీవితం ప్రారంభించాలని ఆమె లక్ష్యం ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం పారా క్రీడాకారుల కోసం నిధులు సేకరిస్తుంది అందు కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ రైడ్ 2020 కి తాన్యా ను ఎంపిక చేసింది. ఈ ప్రయాణం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నలభై మూడు రోజుల్లో ఈ ఈవెంట్ పూర్తి చేసింది తాన్యా  ఈమెకి రాజ్ గఢ్ పోలీస్ శాఖ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కలిసి యూత్ ఐకాన్ ఆఫ్ రాజ్ గఢ్ 2021 బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ అవార్డులతో సత్కరించారు.

Leave a comment