మిథిలా నగరంలో పుట్టిన మైథిలి ఠాకూర్ భజన గాయకురాలు. క్లాసికల్ సంగీతాన్ని నేర్చుకొని హార్మోనియం వాయిస్తూ సోదరులతో కచేరీలు చేయటం ప్రారంభించింది మైథిలీ.ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడిన మైథిలి యూట్యూబ్ లో ప్రతి రోజు ఒక భజన కీర్తన అప్ లోడ్ చేస్తుంది. వేడుకల్లో ఆమె భక్తి గీతాలు పాడితే భక్తులు ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడుతారు. భజనలు,కీర్తనలు పాడుతూ సమాజంలో భక్తి ప్రవృత్తులతో పాటు నైతికతను పెంచడం లక్ష్యం అంటుంది మైథిలీ.

Leave a comment