Categories
![మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. అంచేత ప్రతిరోజూ ఒక మామిడి పండు చొప్పున తింటూ వుంటే నీరసం, నిస్సత్తువ రావు. అజీర్తి చేయదు. ఎక్కువ ఇరోన్వుంటుంది కాబట్టి రక్తహీనత పోతుంది. విటమిన్ ఎ, ఇ, సేలోనియంలు గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. సీజన్ అయిపోయేదాకా రోజుకో పండు తినేస్తేనే మంచిది.](https://vanithavani.com/wp-content/uploads/2017/05/mango.jpg)
చక్కగా మామిడి పళ్ళు వచ్చేశాయి. వీటిని ఇష్టపడని వారు దాదాపు ఉండరు. రోగ నిరోధక శక్తి వ్యవస్థ పటిష్టంగా ఉంచేందుకు శరీరం ఇనుము శోషించుకొనేందుకు చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ సి మామిడి పండులో అధికంగా ఉంటుంది. రొగాలను ఎదుర్కోనే శక్తి ఇచ్చే విటమిన్ ఎ ఫోలేట్ విటమిన్ బి6 కూడా మామిడి పండు లో ఎక్కువే. మామిడి పండులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. కాకాపోతే జ్యూస్ లు,జామ్ లాగా తీసుకొంటే ఈ రసంలోకి చేరే అదనపు చక్కెరల వల్ల పోషకాలు తక్కువగా కేలరీలు ఎక్కువగా చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మధుమేహం ఉన్నవారు రోజుకు పండు తినవచ్చు. ఏదైనా మితంగా ఉంటేనే ఆరోగ్యం కదా!.