ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జోత్స్నా ఆసియా బుక్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన జ్యోత్స్న యూట్యూబ్ లో చూసిన స్టెన్సిల్ ఆర్ట్ నచ్చడంతో ఆ కళ పైన నెలల తరబడి సాధన చేసింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆమె చిత్రించిన రామ పట్టాభిషేకం, శ్రీకృష్ణుని విశ్వరూపం, ద్రౌపతి వస్త్రాపహరణం వంటి ఘట్టాలు ఆమెకు ఎంతో కీర్తి తెచ్చాయి. అలాగే అవార్డులు తెచ్చిపెట్టాయి. పురాణాలు అంటే ఎంతో ఇష్టం అంటున్న  జ్యోత్స్న చిత్రించిన పెయింటింగ్స్ కు ఇప్పుడు ఎంతో ఆదరణ ఉంది.

Leave a comment