కరోనా భయపెడుతున్నా కళ్యాణం ఆగలేదు. ఇండోర్ కు చెందిన అక్షయ్ జైన్  కూతురు కింజాల్ వివాహాన్ని ఎంతో వైభవంగా చేయాలనుకున్నాడు. మరి కరోనా భయం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ముఖాలకు మాస్క్ లు వేసుకొని శానిటైజర్లు దగ్గరే ఉంచుకొని ఫోటోలకు కూడా సామజిక దూరం పాటిస్తూ పెళ్ళి జరిపించాడు. బయట నుంచి పువ్వులు  తెచ్చేందుకు భయపడి ముత్యాల దండాలు మార్చుకొన్నారట వధువరులు. వైరస్ భయం వణికిస్తున్న ఈ సమయంలో ఇలాటి శుభవార్తలు కూడా సంతోషపెడతాయి మరి.

Leave a comment