దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన పారిశుద్ధ్య కార్మికులు మాత్రం తమ సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. వరంగల్ నగర పాలన సంస్థ కమీషనర్ పమేలా సత్పతి తల్లి ప్రభ కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు . కూతురిని చూసేందుకు వరంగల్ వచ్చిన ప్రభ లాక్ డౌన్ కారణంగా వరంగల్ లో ఉండి పోయారు. ఈ సమయాన్ని ఆమె పారిశుద్ధ్య కార్మికుల కోసం మాస్క్ లు కుట్టటం తో గడి పేస్తునారు. ఇప్పటికి రెండు వందల మాస్క్ లు కుట్టి కార్మికుల కోసం ఇచ్చారు. ప్రభ మిషన్ పైన మాస్క్ లు కుడుతున్న దృశ్యాన్ని కమిషనర్ పమేలా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో చూసి మంత్రి కె.టి.ఆర్ ఇది చాలా గొప్ప పని అని ప్రశంసించారు.

Leave a comment