కేరళ కు చెందిన నిధి కురియన్ ఒంటరిగా సొంత కారులో దేశాటన చేస్తోంది..ఈ ప్రయాణానికి ది గ్రేట్ ఇండియన్ సోలో ట్రిప్ అనే పేరు పెట్టింది.. ఆమె సొంత ఊరు కొట్టాయం, కొచ్చిలో నివాసం ఉంటుంది. ట్రావెల్స్కు సంబంధించిన బ్లాగ్ నడిపే నిధి  వంద రోజుల్లో 25 వేల కిలోమీటర్ల సోలో ట్రిప్ చేయాలనుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచెర్రి మీదుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించింది . విశాఖ మీదుగా పూరి వచ్చి ప్రస్తుతం కోల్ కతా దాటింది ఈ దేశం ఈ దేశ స్త్రీలు ఎలా ఉన్నారో వాళ్ళు ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారో స్త్రీల తో మాట్లాడుతూ ప్రయాణం చేస్తోంది ఫేస్ బుక్ లో నిది చేస్తున్న ప్రయాణపు ముచ్చట్లను ఎంతో మంది వింటున్నారు.

Leave a comment