మన ప్రాచీన వైద్యం ఆయుర్వేదం. సహజంగా దొరికే ప్రకృతిసిద్ధమైన ఆహారాన్నే తిన మంటారు ఆయుర్వేద వైద్యులు. ప్రతి రోజు పరగడుపునే ఒక స్పూన్ నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు. నెయ్యి లో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ విటమిన్- ఎ,డి, ఇ,కె రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఎముకలు కండరాలు బలోపేతం అవుతాయి. చర్మం నిగారింపు తో ఉంటుంది. ముఖం పై ముడతలు పోతాయి. పేగుల్లోని పీహెచ్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి. జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

Leave a comment