కోవిడ్-19 ను అరికట్టేందుకు మందు కనిపెట్టేందుకు,టీకా అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం,విద్యావేత్తలు శాస్త్రవేత్తలు,నాసా,వైద్య నిపుణులతో కలిసి,’B కోవిడ్-19 హైపర్ ఫార్మెన్స్ కంప్యూటర్ కన్సార్టియం ఏర్పడింది. ఈ ప్రతిస్టాత్మిక ప్రాజెక్ట్ లో ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ సౌమ్య లిప్సరత్‌కి చోటు దక్కింది . ఇప్పటి నుంచి సౌమ్య పరిశోధన ప్రారంభం అవుతోంది. వైరస్ పైన ఆమెకు చక్కని అవగాహన ఉంది కోవిడ్ లక్షణాలు భౌగోళిక పరమైన ప్రభావాల వివరాలతో ఒక నివేదిక తయారు చేయమన్నది సౌమ్య. సౌమ్య ఒడిశా కు చెందిన యువతి బిటెక్ బయో టెక్నాలజీ పూర్తి చేశాక ఐ ఐ టి మద్రాస్ లో కంప్యుటేషనల్ బయో ఫిజిక్స్ లో పి హెచ్ డీ చేసింది. తర్వాత పరిమాణపు తీరు,డ్రగ్ డిజైనింగ్ ప్రోటాన్ నిర్మాణం పై అధ్యయనం చేసింది. వరంగల్ లోని ఎన్ ఐ టీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది.

Leave a comment