మెంతుల లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. వారానికి ఒకసారి మెంతులతో ప్యాక్ వేసుకుంటే ముఖం పైన డార్క్ సర్కిల్స్ వాటి వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి. టీ స్పూన్ మెంతులు రాత్రంతా నాననివ్వాలి కొన్ని వేపాకులు రెండు కీర దోస ముక్కలు వేసి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ లో ముల్తానీమట్టి నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కాసేపు ఆరిపోయాక చేతులకు తడి చేసుకుని ఐదు నిమిషాలు మర్దన చేసి చల్లటి నీళ్లతో కడిగేయాలి. ముఖం పైన రంద్రాలు మాయమై చర్మం బిగుతుగా అయిపోతుంది.

Leave a comment