మీటూ ఉద్యమానికి ప్రముఖ స్త్రీవాద రచయిత కాలమిస్ట్ శోభడే మద్దతు ప్రకటిస్తూ డెక్కన్ క్రానికల్ లో ‘జమానా ఆఫ్ మేల్ ఎంటైటిల్ మెంట్ ప్రివిలైజ్ ఈజ్ ఓవర్’ అనే వ్యాసం రాశారు.మేం హక్కుదారులం,మేం ఏంచేసిన చెల్లుతుంది అని అనుకునే కాలం చెల్లింది అన్నారు. బైటకు వచ్చిన భాదిత మహిళలకి అజ్ణానంతో ఉండిపోయిన బాధతో వాళ్ళకి ఆమె తన మద్దతు ప్రకటించారు. మీటూ ఇప్పుడు వినిపిస్తుంది. భాదిత మహిళ ఎప్పుడు ఎదో ఒక రూపంలో తన పై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకుంటూనే ఉంది.కొత్త ప్రారంభాలకు ఇది నాంది సమయం అంటుంది శోభాడే. పురుషులతో సమానంగా స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళ పై వేధింపులు ఇతరాత్ర నిందలు ఆరోపనలు వెనక్కి నెట్టడం మగవాళ్ళు మానుకొవాలి అని తన స్వరంతో హెచ్చరించింది శోభ డే.

Leave a comment