కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోటార్ బైక్ ప్రయాణించిన తొలి భారతీయ మహిళ రోషిని శర్మ. ఉత్తర్ ప్రదేశ్ లోని నరోరా లో పుట్టిన రోషిని ఇంజనీరింగ్ చదివారు. బైక్ పైన ప్రయాణంతో ఇష్టంతో ఆమె ఒంటరిగా 11 భారతీయ రాష్ట్రాల గుండా ప్రయాణం చేసింది తన సోలో బైక్ ట్రిప్ తనకు తీర్థయాత్ర వంటిదే అంటుంది రోషిని ఇంజనీర్ గా పనిచేస్తున్న రోషిని సైక్లింగ్, మౌంటెన్ క్లైమ్బింగ్ కు వెళుతుంది. అప్రమత్తంగా ఉంటే మహిళ లైనా ఒంటరి ప్రయాణాలు చేయగలరు అంటుంది రోషిని శర్మ.

Leave a comment